[t4b-ticker]
తుమ్మిడిహట్టి బ్యారేజీపై కదలిక.. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక భేటీ

తుమ్మిడిహట్టి బ్యారేజీపై కదలిక.. సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కీలక భేటీ

ప్రతిపక్షం, ఆగస్టు 27: ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి నిరంతరంగా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలతో జరుపుతున్న సంప్రదింపుల నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న న్యూఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి ముందుకు వెళ్లే మార్గాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును తిరిగి కార్యరూపంలోకి తీసుకురావడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల మధ్య...
మీరాలం ట్యాంక్‌ను అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

మీరాలం ట్యాంక్‌ను అద్భుత పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 27: హైదరాబాద్‌లోని మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి.. ఒక్కో పనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా అత్యుత్తమ రూపకల్పనతో పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మీరాలం ట్యాంక్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, ఇప్పటివరకు చేపట్టిన పనులు, భవిష్యత్‌లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రణాళికలను పూర్తిగా పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం...
నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు ప్రత్యేక హెల్ప్‌లైన్.. ప్రభుత్వం కీలక చర్యలు

ప్రతిపక్షం, ఆగస్టు 27: నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు తక్షణ సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అక్కడ ఉన్న తెలంగాణ వాసుల క్షేమ సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరగక ఆందోళన చెందుతున్న తెలంగాణ వాసులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. బాధితుల...
మూసీ ప్రాజెక్టుకు వేగం.. భూసేకరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

మూసీ ప్రాజెక్టుకు వేగం.. భూసేకరణపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, ఆగస్టు 25, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భూసేకరణలో ల్యాండ్ పూలింగ్ విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు రెండో దశకు సంబంధించిన పనులను ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భూసేకరణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మూసీ పరివాహక ప్రాంతంలో భూముల సేకరణ సందర్భంగా...
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు?.. ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ సూచనలు

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు?.. ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ సూచనలు

ప్రతిపక్షం, ఆగస్టు 25: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. బ్రిటన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. రాబోయే శాసనసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని అభివృద్ధి కార్యక్రమాలపై మరింత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు....
Spread the love